TG: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్హౌజ్ డ్రగ్స్ కేసులో రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, నమిత్ శర్మకు కోర్టులో చుక్కెదురైంది. వీరి బెయిల్ పిటీషన్ను తిరస్కరిస్తూ.. కస్టడీ పిటీషన్పై తీర్పును ఇవాళ్టికి వాయిదా వేసింది. కాగా, వీరిని ఇప్పటికే 3 రోజుల చొప్పున రెండుసార్లు కస్టడీకి తీసుకుని విచారించిన పోలీసులు మరో మూడు రోజుల కస్టడీకి అనుమతి ఇవ్వాలని కోరారు.