MNCL: మున్సిపల్ సిబ్బందికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో తానే పారిశుధ్య కార్మికుడిగా మారాడు MCPIU జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేష్. బెల్లంపల్లి మున్సిపాలిటీ 28వ వార్డ్ లో నెల రోజులుగా డ్రైనేజీలు శుభ్రం చేయకపోవడంతో దోమలు, ఈగలతో వార్డ్ కంపు కొడుతుందని వెంకటేష్ అన్నారు. మున్సిపల్ సిబ్బంది స్పందించక పోవడంతో తానే డ్రైనేజీ శుభ్రం చేశానన్నారు.