WNP: దివ్యాంగులు సమాజంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. కొత్తకోట మండలంలోని పాలెం గ్రామంలో దివ్యంగుడు కావలి వెంకటయ్య కు స్కూటీని అందజేశారు. ఈ త్రిచక్ర స్కూటీలు వారికి రోజువారీ జీవనంలో పెద్ద ఉపశమనం కలిగిస్తాయని పేర్కొన్నారు.