SRPT: ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలు నిఘా నీడలో నిర్వహించనున్నామని ఇంటర్మీడియట్ బోర్డ్ జాయింట్ సెక్రటరీ భీమ్ సింగ్ వెల్లడించారు. శుక్రవారం సూర్యాపేటలోని ప్రభుత్వ కళాశాలలో డీఐఈఓ భాను నాయక్ అధ్యక్షతన నిర్వహించిన సీఎస్డీఓల ఓరియంటేషన్ ప్రోగ్రాంలో పాల్గొని మాట్లాడారు. పరీక్ష కేంద్రాల్లో అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.