MBR: దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండలం అప్పంపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నాయకులు, యువకులు, పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు గురువారం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.