MLG: మంగపేట మండలం రమణక్కపేట ఇసుక ర్యాంపులో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పనులు జరుగుతున్నాయని ఆదివాసీ గిరిజన సంఘం ఆరోపించింది. భారీ యంత్రాలతో ఇసుక తవ్వుతూ స్థానిక ఆదివాసీలకు పనులు ఇవ్వడం లేదని సంఘం జిల్లా కార్యదర్శి గొంది రాజేశ్ నేడు తెలిపారు. రాత్రివేళల్లో అక్రమ ఇసుక రవాణా జరుగుతోందని ఆరోపిస్తూ విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.