TG: హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్రెడ్డికి సీఐడీ నోటీసులు ఇచ్చింది. ఏప్రిల్ 4న హైదరాబాద్లో విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది. జనవరి 29న హుజూరాబాద్లో మేడారం జాతరలో జరిగిన గొడవ దృష్ట్యా కేసు నమోదు చేసినట్లు తెలిపింది. కరీంనగర్ సీపీ, పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కేసు నమోదు కాగా, ఆ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది.