BHPL: రేగొండ మండలం రంగయ్యపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికైన జమలాపురం మోహన్ రావు, వార్డు సభ్యులు శనివారం మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గండ్ర వారికి శాలువా కప్పి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాభివృద్ధి కోసం కృషి చేయాలని సూచించారు. BRS కార్యకర్తలు తదితరులు ఉన్నారు.