వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ మంగళవారం సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా పత్తి ధర రూ.6,960 పలికింది. అలాగే 341 రకం మిర్చి క్వింటాకు రూ.16,150 ధర పలకగా.. వండర్ హాట్(WH) మిర్చి రూ.15,500 పలికింది. తేజ మిర్చి ధర రూ.14,550కి చేరింది. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.