KMM: వెలుగుమట్ల భూబాధితులకు భరోసా కల్పించేందుకు భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మల్కాజిగిరి లోకసభసభ్యుడు ఈటల రాజేందర్ శనివారం ఖమ్మం విచ్చేస్తున్నారు. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ పర్యటనలో భాగంగా ఈటల రాజేందర్ బాధితులతో ముఖాముఖి సమావేశం కానున్నారు.