BDK: కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అనీ, రైతు సంక్షేమమే ధ్యేయంగా పరిపాలన సాగిస్తున్నదని DCMS మాజీ ఛైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు ఇవాళ ఓ ప్రకటనలో వెల్లడించారు. యాసంగి పెట్టుబడుల క్రింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మొదటి విడత 70 లక్షల మంది రైతులకు ఎకరానికి రూ. 6,000 చొప్పున రూ. 3,590 కోట్ల రూపాయలు విడుదల చేయడాన్ని హర్షం వ్యక్తం చేశారు.