MBNR: కౌకుంట్ల మండలం వెంకటగిరిలో శనివారం లక్ష్మీ వేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం వైభవంగా జరగనుంది. ఈ వేడుక కోసం ఆలయాన్ని విద్యుత్ దీపాలు, కాషాయ తోరణాలతో సుందరంగా అలంకరించారు. ఉదయం 11:00 గంటలకు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య జరిగే ఈ దివ్య ఘట్టాన్ని భక్తులు అధిక సంఖ్యలో హాజరై దర్శించుకోవాలని నిర్వాహకులు కోరారు.