MNCL: 46 ఏళ్ల కళామతల్లి సేవకు గుర్తింపుగా ప్రజా కళాకారుడు బెల్లంపల్లికి చెందిన సబ్బని కృష్ణకు బహుజన సాహిత్య అకాడమీ తిరుపతిలో శుక్రవారం కళారత్న నేషనల్ అవార్డును అందజేసింది. సబ్బని కృష్ణ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులుగా, రచయితగా, గాయకుడిగా, దర్శకునిగా పనిచేశారు. అయనకు అవార్డు రావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.