RR: శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇంఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో పాపిరెడ్డి కాలనీ మసీదులో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం సర్వమత సౌభాతృత్వానికి, సమానత్వానికి నిదర్శనమని కొనియాడారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి పేద కుటుంబం సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.