HYD: ఫ్యూచర్ సిటీలో జర్నలిస్టులకు కాలనీ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు CM రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాభవన్లో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా జర్నలిస్టులకు సన్మానం చేశారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు ఫ్యూచర్ సిటీలో కాలనీలు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే జర్నలిస్టులకు కూడా శుభవార్త చెబుతామని వెల్లడించారు.