ADB: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు నగేశ్ ఢిల్లీలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నారా చంద్రబాబు నాయుడితో కలిసి పనిచేసిన రాజకీయ అనుభవాన్ని గుర్తు చేసినట్లు నగేష్ తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రస్తుత రాజకీయాలు తదితరాంశాలపై చంద్రబాబు నాయుడుతో చర్చించినట్లు నగేశ్ పేర్కొన్నారు.