KNR: క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన ‘సంసద్ ఖేల్ మహోత్సవం’ అద్భుత వేదికని డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు పేర్కొన్నారు. కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి పోటీలను ఆయన ప్రారంభించారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్ పోటీల్లో 200 మందికి పైగా క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.