BHNG: కుల, మత, జాతి, లింగ బేధాలు లేకుండా గ్రామంలోని ప్రతి ఒక్కరు కలిసి ఉండాలని జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు దాసరి తిరుమలేశ్ అన్నారు. మంగళవారం మోత్కూర్ మండలం ముషిపట్లలో ఆర్ఐ కాసోజు రవి ఆధ్వర్యంలో నిర్వహించిన పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు.