ప్రకాశం: ఒంగోలు 29వ డివిజన్ కొనిజేడు బస్ స్టాండ్ వద్ద ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పీఎంఏవై 2.0 గృహ ప్రవేశ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పాల్గొని, ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల మందికి ఇళ్ల కల నెరవేరుస్తున్నామని, అర్హులైన వారు పథకాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.