కరీంనగర్: మానకొండూర్ నియోజకవర్గం పరిధిలోని శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి దండు కొమురయ్యపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి చేశారు. గ్రామంలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఓ వ్యక్తిని పరామర్శించడానికి వెళ్లి వస్తున్న క్రమంలో కారం పొడితో దాడి చేశారు. దీంతో దండు కొమురయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు.