MDK: ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం కౌడిపల్లి ప్రభుత్వ వైద్యాధికారులకు ఆశా వర్కర్లు వినతిపత్రం సమర్పించారు. మూడు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలు మంజూరు చేయాలని, ఆశ వర్కర్లకు కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం సమర్పించారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన చేస్తామన్నారు.