KNR: అపర భద్రాద్రిగా పేరుపొందిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం 5 గంటలకు ప్రధాన ఘట్టమైన సూర్య రథోత్సవం (చిన్నరథం) నిర్వహించనున్నట్లు ఆలయ ఛైర్మన్ రామారావు, ఈవో సుధాకర్ తెలిపారు. భక్తులు పెద్దసంఖ్యలో తరలిరావాలని కోరారు. భక్తుల సౌకర్యార్థం విద్యుత్, తాగునీరు, ఇతర మౌలిక వసతులు కల్పించినట్లు నిర్వహకులు పేర్కొన్నారు.