KNR: రామడుగు మండలం తిరుమలాపూర్లోని దళిత కాలనీలోని గృహాల మీదుగా వెళ్తున్న 33 కేవీ హైటెన్షన్ విద్యుత్ తీగలను వెంటనే తొలగించాలని మాజీ సర్పంచ్ తడగొండ సత్యరాజ్ వర్మ డిమాండ్ చేశారు. గ్రామస్థులతో కలిసి ఆకాశానికి చేతులెత్తి ఆయన నిరసన తెలిపారు. ప్రమాదకరంగా ఉన్న ఈ వైర్ల వల్ల ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నడిపెల్లి రాజేశ్వరరావు పాల్గొన్నారు.