KNR: మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సమస్యలపై ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంను ఉద్యమకారుల జేఏసీ నాయకులు కలిసి వినతిపత్రం సమర్పించారు. గత ప్రభుత్వం ఉద్యమకారులను విస్మరించిందని జేఏసీ రాష్ట్ర ఛైర్మన్ బోగే పద్మ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం తక్షణమే కమిటీని ఏర్పాటు చేసి, తమ డిమాండ్లు నెరవేర్చేలా చొరవ చూపాలని వారు కోరారు.