MBNR: మిడ్జిల్ మండలంలోని లింబ్యతండాలో సోమవారం పశువైద్యాధికారి శివరాజ్ ఆధ్వర్యంలో పాడి పశువులకు ఉచితంగా గాలికుంటు నివారణ టీకాలు వేశారు. గ్రామ సర్పంచ్ మన్ని శంకర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పశుపోషకులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ జీవాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలని అధికారులు కోరారు.