BHNG: భువనగిరి మున్సిపాలిటీ 3వ వార్డు రాయగిరి రామాలయంలో నిర్వహించనున్న శ్రీరామనవమి ఉత్సవాల కోసం అవనగంటి శ్రవణ్ కుమార్ తన వంతు సహాయంగా రూ. 20,000 విరాళం ప్రకటించారు. ఈ మొత్తాన్ని శుక్రవారం కౌన్సిలర్ పాల్త్య వెంకటేష్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పల్లెర్ల యాదగిరి, యూత్ సభ్యులు అవిశెట్టి మల్లేష్, దాసరి పండు, బోజ్జ చంద్రయ్య పాల్గొన్నారు.