ఉమ్మడి మెదక్ జిల్లాలో జహీరాబాద్ మున్సిపాలిటీ పన్నుల వసూళ్లలో వెనుకబడి ఉంది. మొత్తం 22,172 నివాసాల నుంచి రూ. 23.58 కోట్ల పన్నులు వసూలు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం రూ. 6.24 కోట్లు (26.41%) మాత్రమే వసూలయ్యాయి. మరో మూడు రోజుల్లో రూ.17.14 కోట్లు వసూలు చేయాల్సి ఉందని కమిషనర్ జైత్ రామ్ తెలిపారు. గడువులోగా గృహ, ట్రేడ్ లైసెన్స్ పన్నులు చెల్లించి సహకరించాలని కోరారు.