BHNG: మోత్కూరు మండలంలోని బుజిలాపురం గ్రామ సమీప ప్రధాన రహదారిపై శుక్రవారం ఉదయం భారీ కొండచిలువ ప్రత్యక్షమై కలకలం రేపింది. సుమారు 20 కిలోల బరువున్న ఈ భారీ సర్పం రోడ్డుపై వెళ్తుండగా వాహనదారులు, స్థానికులు గమనించి భయాందోళనకు గురయ్యారు. ఈ సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.