NZB: నవీపేట్ మండలం కోస్లీ గ్రామపంచాయతీ కార్యాలయంలో నలుగురు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను బుధవారం అందజేశారు. సెక్రటరీ రాజేశ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జీపీవో సుభాష్, సర్పంచ్ బాబు సింగ్, ఉపసర్పంచ్ సందీప్ పాల్గొన్నారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్థిక సాయం ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు.