KNR: ప్రస్తుత రోజుల్లో విద్యతో పాటు వివిధ రకాల నైపుణ్యాలు ఎంతో ముఖ్యమని, అప్పుడే ఉపాధి మార్గాలు లభిస్తాయని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితారాణా అన్నారు. శాతవాహన యూనివర్సిటీలో జరిగిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు “అకాడమిక్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాం” కార్యక్రమానికి ఉన్నత విద్యాశాఖ కమిషనర్ దేవసేనా, కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాతో కలిసి హాజరయ్యారు.