KMR: జిల్లాలో ‘మన ఇసుక-వాహనం’ ఆన్లైన్ విధానాన్ని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అమలు చేశారు. వినియోగదారులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాకే ఇసుక పొందాలి. ధరలు టన్నుకు, సాధారణ గృహాలకు రూ. 900, ప్రభుత్వ పనులకు రూ. 660గా నిర్ణయించారు. ఇందిరమ్మ ఇళ్లకు రాయితీ ధర వర్తిస్తుంది. పారదర్శకత కోసమే ఈ నిర్ణయమని కలెక్టర్ స్పష్టం చేశారు.