SRPT: పట్టణంలో గణేష్ శోభాయాత్ర నిమజ్జనం సంబంధించి, జిల్లా ఎస్పీ నర్సింహా శుక్రవారం పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన నిమజ్జనం ప్రదేశాన్ని పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. సద్దలచెరువు వద్ద ఏర్పాటుచేసిన సీసీ కెమెరా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పట్టణంలో జరుగుతున్న శోభాయాత్రను పరిశీలించారు.