SRD: మనూరు మండలం డవ్వూరు శివారులోని లొంక హనుమాన్ మందిరంలో శనివారం నిర్వహించిన ప్రత్యేక ఉత్సవాల్లో ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఆయన సతీమణి అనుపమ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యే దంపతులకు తీర్థ ప్రసాదాలు అందించి స్వామి వారి ఆశీస్సులు అందజేశారు.