KNR: ఇల్లందకుంట మండలం సిరిసేడు-మాల్యాల రోడ్డు బురదమయంగా మారింది. దీంతో రైతులు, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. రైతులు వ్యవసాయ బావుల వద్దకు వెళ్లడానికి అవస్థలు పడుతున్నారు. గతంలో మంజూరైన 2.5 కి.మీ తారు రోడ్డు పనులు పూర్తి కాకముందే నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ రోడ్డు పూర్తయితే ప్రయాణికులకు 3 కి.మీ ప్రయాణ భారం తగ్గుతుంది.