NRML: సారంగాపూర్ మండలం అడెల్లి పోచమ్మ ఆలయం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎల్లపెల్లికి చెందిన ముచ్చిండ్ల భీమయి (60) మృతి చెందింది. ఆటోలో అడెల్లి దేవాలయానికి వెళ్తుండగా, వెనుక నుంచి వచ్చిన డీసీఎం వాహనం ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో DCM భీమయి తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI పేర్కొన్నారు.