పట్టణంలోని 35వ వార్డు పందులు, కోతులకు నిలయంగా మారింది. రోడ్లపై పేరుకుపోయిన వ్యర్థాలను తింటూ ఇవి స్థానికులపై దాడులకు తెగబడుతున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి కోతులు, పందుల బెడదను నివారించాలని, పట్టణ ప్రజలు అధికారులను కోరారు.