జగిత్యాల రూరల్ మండలం తక్కల్లపల్లి గ్రామంలో ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామ వీధుల గుండా భక్తిశ్రద్ధలతో సాగిన ఊరేగింపులో మహిళలు బోనాలు సమర్పిస్తూ పాల్గొన్నారు. డప్పులు, పూజా కార్యక్రమాలతో గ్రామం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. అనంతరం ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించి విగ్రహాన్ని ప్రతిష్టించారు.