NLG: మిర్యాలగూడ పట్టణంలోనూ, వేములపల్లి మండలం శెట్టిపాలెంలల్లో ఇవాళ జరిగిన ‘రన్ ఫర్ జీసస్’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీస్తు చూపిన ప్రేమ, త్యాగం అందరికీ ఆదర్శమన్నారు. ఈ పరుగు ఐక్యతకు నిదర్శనమని, యువత ఆధ్యాత్మికంగా, శారీరకంగా బలపడాలని ఆకాంక్షించారు.