BDK: సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యవర్గ కౌన్సిల్ సమావేశంలో సీపీఐ మేయర్ మూడ్ గణేష్ని మంగళవారం కౌన్సిల్ సభ్యులు సన్మానించారు. తనకు గుర్తింపునిచ్చిన పార్టీకి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని భావోద్వేగంగా పేర్కొన్నారు. కమ్యూనిస్ట్ సిద్ధాంతాలతోనే పేదలకు న్యాయం జరుగుతుందని, పార్టీ బలోపేతానికి కార్యకర్తలు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.