WGL: గ్రేటర్ వరంగల్ 20వ డివిజన్ పరిధిలోని కాశీబుగ్గలోని రంగనాథ స్వామి దేవాలయంలో ఇవాళ చండీహోమాన్ని నిర్వహించారు. అమావాస్య సందర్భాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం జరిగింది. స్థానిక మహిళలు, దంపతులు కార్యక్రమంలో పాల్గొని హోమం చేశారు. దేవాలయం మాజీ అధ్యక్షులు వంగరి రవి, కమిటీ సభ్యులు, అర్చకులు ఆరుట్ల కృష్ణమాచార్యులు, తదితరులున్నారు.