MNCL: హాజీపూర్ మండలం గుడిపేటలోని ఆవాస పాఠశాలను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించారు. పాఠశాలలో చేపట్టిన అదనపు గదులు, ఇతర అభివృద్ధి పనులను పరిశీలించి, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వంటశాలలో నిత్యావసర సరుకులు, తాజా కూరగాయలు వినియోగించాలని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేలా సిబ్బంది నిబంధనలు పాటించాలని తెలిపారు.