KNR: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించిందని ఆరోపిస్తూ బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట భారీ నిరసన చేపట్టారు. ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. రైతు రుణమాఫీ, మహిళలకు నగదు బదిలీ వంటి పథకాల్లో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు.