WNP: మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రేవల్లి మండల ఎస్సై రజిత ఆదివారం హెచ్చరించారు. మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని ఆమె స్పష్టం చేశారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు.