KMM: రేపు జరగబోయే పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 163 బీఎన్ఎస్ఎస్ సెక్షన్ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఐదుగురికి మించి గుంపులుగా ఉండకూడదని, జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు.