NGKL: వంగూరు మండలంలోని సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ప్రహరీ గోడతో పాటు 43ఇళ్లను అధికారులు కూల్చివేశారు. గ్రామంలో రూ.8 కోట్లతో రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం ఇంటి వద్ద రోడ్డు మరమ్మతులు చేపడుతున్నారు. ఇళ్లు కోల్పోయిన వారికి ప్రభుత్వం నష్టపరిహారం అందించనుంది.