BDK: మణుగూరు మండలం కూనవరం లో మజీద్-ఎ-బిలాల్ కమిటీ ఆధ్వర్యంలో పవిత్ర రమజాన్ మాసం సందర్భంగా నిర్వహించిన ఇఫ్తార్ విందులో పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస విరమణ చేసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం సహనం, సేవా భావం, దయ, సౌభ్రాతృత్వానికీ ప్రతీక అని కొనియాడారు.