PDPL: ధర్మారం మండలం బొట్ల వనపర్తి ఎస్సీ కాలనీలో సర్పంచ్ సంఘ రంజిత్ ఆధ్వర్యంలో ఇవాళ సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. రూ. 5 లక్షల ఉపాధి హామీ పథకం నిధులతో పనులు చేపట్టినట్లు సర్పంచ్ తెలిపారు. ఈ సందర్భంగా విధుల మంజూరుకు కృషిచేసిన మంత్రి లక్ష్మణ్ కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.