KNR: గంగాధర మండలంలోని రంగరావుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో బుధవారం సర్పంచ్ దాసరి శంకరయ్య ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఈ సందర్భంగా పశు పెంపకందారులు తమ పశువులకు టీకాలు వేయించి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. సర్పంచ్ శంకరయ్య మాట్లాడుతూ.. పశువుల ఆరోగ్యంపై రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.