HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో జోరు పెంచింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా గురువారం మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావులు ఎర్రగడ్డ డివిజన్లో ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిపించాలని ప్రజలను కోరారు.