PPM: సాలూరు మండలంలో జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్ది గురువారం విస్తృతంగా పర్యటించారు. మొంథా తుఫాన్లో దెబ్బతిన్న పంటలను, పునరావాస కేంద్రాల్లో అందుతున్న సహాయక చర్యలని క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ముందుగా సాలూరులో జరిగిన మొంథా తుఫాన్ బాధిత 79 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కాగా, ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు.